Saturday, June 10, 2017

తెలంగాణ ప్రభుత్వపాలన దేశానికే ఆదర్శం. Telangana a model to others.

తెలంగాణ ప్రభుత్వపాలన దేశానికే ఆదర్శం.

                                                                                                         సిహెచ్ వి. ప్రభాకర్ రావు.                                                                                            సీనియర్ జర్నలిస్ట్.9391533339

చరిత్ర ఎప్పుడు చైతన్యవంతమైనది. గత కాలపు అనుభవాలు వర్తమానం లో జరిగే సంఘటనలే రేపటి చరిత్ర. తెలంగాణ రాష్ట్ర చరిత్ర అంతా పోరాటాలే, నిన్నటి పోరాటాల పారాలే రేపటి బంగారు భవితకు, పునాదులు వేస్తున్నాయి. 1953 నుండి జరిగిన ప్రత్యెక రాష్ట్ర పోరాటాలకు తెలంగాణ రాష్ట్ర సమితి అద్వర్యలో 2001లో రాజకీయ ఎత్తుగడలతో ప్ర్రారంభం ఐన  ఉద్యమం తరతరాల తెలంగాణా ప్రజల ఆకాంక్ష నెరవేరింది. 14 ఎల్ల సుదీర్ఘ పోరాట అనంతరం ఏర్పడ్డ తెరాస ప్రభుత్వం, అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సునిశిత దూర సృష్టి తో గడిచిన మూడేళ్ళలో భారత దేశం లోనే తన ప్రత్యేకతను నిలుపుకొంటూ, దేశం లోని మిగతా 28 రాష్ట్రాలోకేల్ల ముందుంది.బడుగు బలహీన వర్గాల అభివృద్దే లక్ష్యంగా తెలంగాణా ప్రాభుత్వం పనిచేస్తున్దనడానికి ఇతర రాష్ట్రాల అధినేతలు మన ప్రణాలికలను, పతకాలను చూసి, వాటిని తమ రాష్ట్రాలలో ప్రారంభించడమే నిదర్శనం. దేశం అన్నా,రాష్ట్రం అన్నా ప్రజల సంక్షేమమే ముఖ్యం.అభివృద్ధి నమూనాలు అనేక రకాలు. కింది తరగతి ప్రజలు, పేదరికం లో మ్రగ్గే బడుగు బలహీన వర్గాల ప్రజలు సంతోషంగా, లేకున్నా గ్రామాలలో  ఉండే నిస్సహాయకులకు తగిన అండదండలు లేకున్నా రాష్ట్రం లో జరిగే అభివృద్ధి అసంపూర్ణమే.  ఒక్క వర్గానికే అభివృద్ధి ఫాలలు అందితే లాభం  లేదనే గ్రామీణ ప్రాంతాలలోని గొల్ల,కుర్మా, బెస్త, గంగాపుత్ర, ముదిరాజు, చేనేత, కళ్ళు గీతా కార్మికుల శ్రేయస్సుకై అనేక పతకాలను ప్రారంభించారు. మిషన్ కాకతీయ తో నిండిన చెరువులలో ఉచితంగా చేపపిల్లల పెంపకం, గొర్రెల పెంపకం లో రాయితీలు,చేనేత కార్మికులకు ఉపాధి కల్పనా పతకాలు, ఇతర వృత్తి కార్మికులకు వారి పనులలో రాయితీలతో పనిముట్లు అందజేయడం లాంటి అనేక పథకాలతో గ్రామీణ ఆర్ధిక వ్యవస్తను పరిపుష్టం చేసే అనేక కార్యక్రమాలను కెసిఆర్ ప్రభుత్వం చేపట్టింది. గీతా కార్మికులకు గతం ఇచ్చినట్లుగా కాకుండా తాటి , ఈత వనాలను తుంపర లేదా డ్రిప్ పద్దతులలో  పెంచుకోవడానికి ఉద్యానవన శాఖ ద్వారా రుణాలను, సబ్సిడీ అందజేస్తుంది.తెలంగాణ ప్రజల మనసులను ఆకట్టుకొని, వారి అభ్యున్నతికే కట్టుబడి పాలన చేస్తున్న కేసిర్ పై ఎలాంటి ఆరోపణలు చేయాలో తెలియని ప్రతిపక్షం తలాతోకా లేని ఆరోపణలు చేయడం, అవి తిరిగి వారి నేట్టికే చుట్టుకోవడం తో గత మూడేళ్ళుగా గూడు విడిచిన పక్షుల్లా ప్రతిపక్షాలు గాల్లో తేలిపోతూ, వచ్చే ఎన్నికలంటూ అప్పుడే కలల విహంగం లో విహరిస్తున్నాయి. ప్రభుత్వం,మంత్రివర్గం ఒకే మాటగా, ఒకే బాట గా తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నూతన పథకాలతో అప్రతిహాతంగా కొనసాగుతుంటే, మింగుడు పడడని ప్రతిపక్షాలు ఒడ్డున పడ్డ చేప పిల్లలా గిలగిలా కొట్టుకొంటున్నాయి.ప్రజాస్వామ్య దేశం లో గెలుపు ఓటములు పరిపాటే. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రానా ప్రపంచమే క్రింది మీదైనట్లుగా, యాగిచేసే ప్రతిపక్షాలు సిద్దాంతాలను మరిచి, పోత్తులకై  ముందే కూయడం విడ్డురం.గడిచిన మూడేళ్ళ పాలనలో రోజుకో కొత్త పాతకం తో ప్రజా సమస్యలను తీర్చడానికి అహర్నిశలు కృషి చేసే కేసిర్ ప్రభుత్వం పట్ల ప్రజలకు అత్యంత విశ్వాస్వం, నమ్మకం ఉంది. అందుకే ఎన్ని సార్లు సర్వేలు జారిపినా టి ఆర్ఎస్  పార్టీకే మెజారిటి పెర్గుతుంది కాని తగ్గడం లేదు. మైనార్టీలైనా, మేజార్టీలైనా ప్రజలంతా ఒకటే అన్న నినాదం తో టి ఆర్ ఎస్ ప్రభుత్వం ముందుకు పోతూ, ముస్లిం లలోని నిరుపేద వర్గాలైన 14 కులాల వారికి రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించి చట్టం చేసింది. అలాగే వెనుకబడిన తరగతులకు మరిన్ని రిజర్వెంశాన్లు కల్పించాలని, వారిలోని అతిగా వెనుకబడిన జాతులను గుర్తించి వారి అభ్యున్నతికై తగు నూతన ప్రణాలికలు వేసుకోవాలని, విద్యకు, ఉద్యోగాలకు అసలే నోచుకోని నిమ్న జాతులకు తగు ప్రాతినిధ్యం కల్పించాలని రాష్ట్ర బి సి కమీషన్ ద్వారా ప్రత్యెక విచారణ జరిపిస్తుంది.కులమతాలకు అతీతంగా, బీద, బలహీన బడుగు వర్గాలకు నిజంగా ఆర్ధిక ఫలాలు అందాలని, అన్ని వర్గాల ప్రజలు ఒకే గాటిన అభివృద్ధి చెందినపుడే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందినట్లని భావించే నిజమైన సంక్షేమ రాజ్యం మన తెలంగాణ ప్రభుత్వం.వ్యవసాయానికినీరు, త్రాగడానికి మన్చి నీరు అందించే లక్ష్యంగా ప్రారంభించిన పతకాలు కేంద్ర ప్రభుత్ర్వ దృష్టిని ఆకర్షించడమే కాకుండా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను మన రాష్ట్రానికి రాప్పించాయి.భూగర్భ జలాల మట్టం కూడా గణనీయంగా పెరగడానికి మిషన్ కాకతీయ కారణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.పట్టణీకరణ ప్రభావమో, గ్రామాలలో ఉపాధి అవకాశాలు తగ్గడమో కాని గ్రామాలలో వయసుపై బడిన ప్రజల సంఖ్యా పెరిగిపోతుంది. వివిధ కారణాల వళ్ళ ఒంటరి మహిళల సంఖ్యా కూడా పెరిగిపోయింది. విధి వక్రీకరించి దివ్యాన్గులుగా పుట్టిన వారు, ఆరోగ్య రీత్యా దివ్యాన్గులుగా మారిన వారు ఇతరులపై ఆధారపదడి బ్రతకడం నిజంగా దుర్భరం. వీరంతా సమాజానికి భారంగా మారిపోయి, సమాజ ప్రగతికి అడ్డంకులు ఏర్పడతాయి. ఇలాంటి వ్యక్తులు ఉన్న కుటుంభాలలో ఎన్నో సామాజిక, ఆర్ధిక సమస్యలు తలెత్తుతాయి. వీటిని పరిష్కరించడం ప్రభుత్వ భాద్యత.అందుకే తెలంగాణా ప్రభుత్వం ఎలాంటి ఆధారం లేని వారు  కూడా స్వతంత్రంగా, తలెత్తుకొని బ్రతెకే విధంగా ఆసరా కల్పించిన ప్రభుత్వం తెరాస ప్రభుత్వం. ఇదంతా సమాజం పట్ల భాద్యతనేరిగిన ప్రభుత్వాధినేత కేసిర్ ఆలోచనల ఫలితమే.ఆడ బిడ్డను కనడమే పాపం అన్నట్లు, కోడల్ని ఇంట్లోనుండి పంపించే దురాచారాన్ని, ఆడబిడ్డ పుడితే పురిట్లోనే చంపివేసే దౌర్భాగ్యపు సంస్కృతిని తుదమోట్టిన్చాలనే ధృడసంకల్పం నుండి పుట్టిందే” కళ్యాణ లక్ష్మి” పథకం. తెలంగాణలో ఒక్క హినువులే కాదు మైనార్తిలుగా చుదబడే ఇస్లాం మతస్తులకు కూడా వర్తిన్చేట్లు “షాది ముభారాక్ “ పతాకాన్ని కుడా ప్రకటించి ప్రతి ఆడ బిడ్డ పెళ్ళికి పెద్దన్నయ్యగా ప్రభుత్వం 51౦౦౦/-రూపాయల ఆర్ధిక సహాయం అందజేస్తుంది.పెళ్లి వరకు ఎదిరి చూడకుండా, అన్ని వర్గాల మహిళలకు న్యాయం చేయాలని, ప్రభుత్వ ఆసుపత్ర్లలో ప్రసవం అయ్యే ప్రతి ఆడపడచుకు 12౦౦౦/- ఇయ్యాలని నిర్ణయించడం బడుగు బలహీన వర్గాల ఆభ్యున్నతికి ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం. అలాగే ఆ ప్రసవం లో ఆడపిల్ల పుడితే మరో వెయ్యి రూపాయలు కలిపి మొత్తం రు,13,౦౦౦/- నగదు ప్రోత్సాహాన్ని ప్రకటించింది.వ్యవసాయం బారంగా మారిన ఈ రోజులలో రైతులకు అండగా ఉండాలనే లక్ష్యం తో ప్రభుత్వం ప్రతి ఎకరానికి రు.4౦౦౦/-ల చొప్పున ప్రతి పంటకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యవసాయదారుల ప్రోత్సాహక  పథకం.   తెలంగాణ రాష్ట్రం సాంకేతికంగా కొత్తగా ఏర్పడినా ఇక్కడి నాయకత్వం ఎన్నో పోరాటాలతో రాటుదేలి ఉంది . గత ప్రభుత్వాలలో పనిచేసిన నాయకులు ఎప్పుడు పదవీకాంక్షతో ఉండడం వల్లే మన రాష్ట్రం అభివృద్ధి చెందలేదనే విషయాన్ని గ్రహించిన తరువాతే ఉద్యమం చేసి మరి రాష్ట్రం సాధించుకొని ఉద్యమ సారతినే రాష్ట్ర సారథిగా ఎన్నుకొన్న ప్రజల విజ్ఞతను అర్థం చేసికోలేని వారు నాయకులు కాలేరు. ప్రతిపక్షం లో ఉన్న వారు అధికార పక్షం లో చేరడం అంటే ఆ పార్తిలలో మార్గదర్శనం చేయగల నాయకులు లేరని, అక్కడ రాష్ట్ర అభివృద్ధి కన్నా స్వంత అజెందానే ముఖ్యమనే విషయాన్ని గ్రహించిన నాయకులే టి ఆర్ ఎస్ పార్టిలో చేరి ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నారు.టి అర్ ఎస్ నాయకులకు దిశానిర్దేశం చేయగల సమర్థుడైన కెసిఆర్, తెలంగాణ రాష్ట్రానికి అసలైన నాయకుడని గ్రహించిన ప్రజల అభిమతానికి తల ఒగ్గిన వారే పార్టిలో ఇముడగల్గుతున్నారు.ప్రజల అభీష్టానికి, వారి సంక్షేమాన్ని దృష్టి లో పెట్టుకోలేని నాయకత్వం రాష్ట్రాభివృద్ధికి కృషిచేయలేదు. అందుకే గతం లోని ప్రభుత్వాలు మట్టి కొట్టుక పొయాయి. ఈ మూడేళ్ళ పాలనలో కేంద్ర ప్రభుత్వం తో సయోద్యగా ఉంటూనే, అవసరం ఐన చోట ప్రశ్నిస్తూ,ప్రభుత్వ వ్యక్తిత్వాని, స్వంత ఉన్కిని కాపాడుకొంటూ కెసిఆర్ ముందుకు పోతున్నాడు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలించే ఎ పార్టి ప్రభుత్వాన్ని కూడా ప్రజలు దూరం చేసుకోరు. అందులో కెసిఆర్ లాంటి ప్రజా నాయకున్ని  తెలంగాణ ప్రజలు పదికాలపాటు కనురెప్పలా కాపాడుకొంటారు.సిహెచ్ వి ప్రభాకర్ రావు.
సీనియర్ జర్నలిస్ట్
౩౦౩ ఎటర్నల్ కృష్ణ, రోడ్ నం. 4, హరిపురి కాలనీ.
కోత్త పేట, హైదరాబాద్. 500 035
Cell: 9391533339

Email: chvprabhakarrao@gmail.com

No comments:

Post a Comment